తెలంగాణ

telangana

ETV Bharat / state

నీటి గుంటలో పడి బాలుడు మృతి - boy fall in Water pond in nlgonda district

పదకొండేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి చనిపోయిన ఘటన నల్గొండ జిల్లా దుబ్బాకాల్వలో చోటుచేసుకుంది. బాబు మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

boy fall in Water pond in nlgonda district
నీటి గుంటలో పడి బాలుడు మృతి

By

Published : Jan 17, 2020, 11:42 PM IST

నల్గొండ జిల్లా మునుగోడు మండలం దుబ్బాకాల్వకు చెందిన దండు యాదయ్యకు ఇద్దరు కుమారులున్నారు. పెద్ద కుమారుడు రాకేశ్​(11) మునుగోడలో ఓ ప్రైవేటు పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. రాకేశ్​ ఈ రోజు అమ్మనాన్నలతో పొలానికి వెళ్లాడు.

అక్కడే ఉన్న తన బాబాయి కొడుకుతో కలిసి ఊరి చివర ఉన్న నీటి గుంట వద్దకు వెళ్లారు. సరదగా నీటిలో ఆడుకునేందుకు అందులో దిగి పడిపోయాడు. వెంటనే అతని బాబాయి కొడుకు ఊళ్లోకి వెళ్లి చెప్పెలోగా రాకేశ్​ ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

నీటి గుంటలో పడి బాలుడు మృతి

ఇవీ చూడండి;నిర్భయ దోషి క్షమాభిక్షకు నిరాకరించిన రాష్ట్రపతి

ABOUT THE AUTHOR

...view details