నూతన రెవెన్యూ చట్టంతో ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త శకాన్ని సృష్టించారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.. మెదక్లో రెవెన్యూ చట్టాన్ని స్వాగతిస్తూ.. ముఖ్యమంత్రి కృతజ్ఞతగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి,ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో 300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. జూనియర్ కళాశాల నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది.
'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ' - మేదక్ జిల్లా వార్తలు
నూతన రెవెన్యూ చట్టంతో ప్రజలకు పారదర్శక సేవలు అందుతాయని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ సుభాష్రెడ్డి అన్నారు. సీఎంకు కృతజ్ఞతగా 300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

'ముఖ్యమంత్రికి కృతజ్ఞతగా ట్రాక్టర్ల ర్యాలీ'
నూతన రెవెన్యూ చట్టంతో అవినీతికి తావు లేకుండా సేవలు అందుతాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బాంధవుడని నేతలు కొనియాడారు.
ఇవీచూడండి:పారదర్శక సేవల కోసం సమూల మార్పులు..