మెదక్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు గోపిక, కృష్ణుడి వేషధారణలో అలరించారు. శ్రీ కృష్ణుడి పాటలకు నృత్యాలు చేస్తూ అందరినీ ఓలలాడించారు. విద్యార్థులకు చిన్నారి దశలోనే పండుగ విశిష్టతను తెలిపేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పాఠశాల యాజమాన్యం తెలిపింది.
వైభవోపేతంగా కృష్ణాష్టమి వేడుకలు
మెదక్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వైభవంగా కృష్ణాష్టమి నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న పాఠశాల విద్యార్థిలు ఉత్సాహంగా సందడి చేశారు.
శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు