తెలంగాణ

telangana

ETV Bharat / state

యూరియా కొరతపై కాంగ్రెస్​ ధర్నా.. నిలిచిన రాకపోకలు - యూరియా కొరతపై కాంగ్రెస్​ ధర్నా.. నిలిచిన రాకపోకలు

యూరియా కొరత, రైతు సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్​ నిరసన బాట పట్టింది. మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం నుంచి అంబేడ్కర్​ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు.

యూరియా కొరతపై కాంగ్రెస్​ ధర్నా.. నిలిచిన రాకపోకలు

By

Published : Sep 11, 2019, 10:47 PM IST

దేశంలోనే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్​ నాయకులు మండిపడ్డారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో ధర్నా చేపట్టారు. కాంగ్రెస్​ కార్యాలయం నుంచి అంబేడ్కర్​ కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా.. రైతుల సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలం అయిందని మండిపడ్డారు. బడ్జెట్​ కేటాయింపుల్లో వ్యవసాయానికి తక్కువ కేటాయింపులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్​ నేతల ఆందోళనతో ప్రధాన రహదారిపై కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి.

యూరియా కొరతపై కాంగ్రెస్​ ధర్నా.. నిలిచిన రాకపోకలు

ABOUT THE AUTHOR

...view details