గతేడాది జిల్లా వ్యాప్తంగా 33 మలేరియా, 216 డెంగీ కేసులు నమోదైనట్లు నాకు తెలిసింది. డెంగీ నుంచి ప్రాణాలతో బయటపడేందుకు పలువురు రోగులు ఆస్పత్రుల్లో రూ.లక్షలు ఖర్చు చేసినా వారిలో కొందరు మృతి చెందారని తెలిసి చాలా బాధపడ్డాను. ఇందులో ఎక్కువగా గార్ల మండలంలోనే బాధితులున్నట్లు తెలిసింది. మీ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం, గూడూరు, బయ్యారం, గార్ల ప్రాంతాల్లో సీజనల్ వ్యాధుల ముప్పు అధికంగా ఉందని నాకు ప్రాథమిక సమాచారం వచ్చింది. ఈ సారి ఇక్కడి ప్రజలకు మలేరియా, డెంగీ వ్యాధుల ముప్పు లేకుండా చేయడమే పనిగా పెట్టుకున్నాను.
300 దోమ గుడ్లను తినేస్తా..
..అన్నట్లు నేను ఎలా దోమలను అంతం చేస్తానో మీకు చెప్పనే లేదు కదా. నిల్వ నీటి గుంతలు, మురుగు నీటి కాలువల్లో నివసించే దోమలు గుడ్లను పెడుతాయనే సంగతి మీకు తెలుసుగా.. స్క్వేర్ మీటర్ కలిగిన గుంతకు మాలో ఒక చేపను వదులుతారు. మేము ఎంచక్కా 300 దోమ గుడ్లను తినేస్తాం. ఇలా గుంతల పరిమాణాన్ని బట్టి మమ్మల్ని మీ జిల్లా మత్స్యశాఖ అధికారులు వదిలిపెడుతారు. మా గంబూషియా చేపలం.. ఒకటిన్నర నుంచి రెండు ఇంచుల వరకు పెరుగుతుంటాం. ప్రతి మూడు నెలలకోసారి పిల్లలు పెడుతాం. మేము దోమల గుడ్లను, లార్వాలనే కాకుండా చిన్న చిన్న కీటకాలను కూడా తిని జీవిస్తాం.
20 వేల చేపలను వదిలేందుకు లక్ష్యం..