తెలంగాణ

telangana

By

Published : Mar 12, 2020, 6:58 PM IST

ETV Bharat / state

ప్రేమ అన్నాడు..పెళ్లి చేసుకోమ్మంటే పారిపోయాడు..

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రియుడు మోసం చేశాడని యువతి రోడ్డెక్కింది. ప్రేమించిన వ్యక్తితోనే తన పెళ్లి జరిపించాలని ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. గత రెండేళ్లుగా ప్రేమలో కొనసాగుతున్నామని...తనకు న్యాయం చేయాలని బాధితురాలు కోరుతోంది.

నాకు న్యాయం చేయండి : బాధితురాలు
నాకు న్యాయం చేయండి : బాధితురాలు

కుమురం భీం ఆశిఫాబాద్ జిల్లాలో ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసనకు దిగింది. తాము రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నామని...ఈ క్రమంలో పెళ్లి చేసుకుందామంటే ప్రియుడు ప్రభాకర్ ముఖం చాటేశాడని ఆందోళన వ్యక్తం చేసింది. తమ వివాహానికి ప్రభాకర్ తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదనే సాకుతో తనకు కనిపించకుండా తిరుగుతున్నాడని వాపోయింది. ఈ సందర్భంగా యువకుడి నివాసానికి వచ్చి బైఠాయించింది. గమనించిన ప్రభాకర్ తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు. రెండేళ్లుగా తనను అన్ని రకాలుగా వాడుకుని ఇప్పుడు తిరస్కరించాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత యువతికి న్యాయం జరిగే విధంగా చూస్తామని మానవ హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సైరా భాను తెలిపారు. గీతకు అండగా ఉండాలని ఆమె గ్రామస్తులను కోరారు.

నాకు న్యాయం చేయండి : బాధితురాలు

ఎంతో నమ్మాను కానీ...

రెండేళ్ల క్రితం గంగాపూర్ గ్రామంలో ఒక పెళ్ళిలో వీరికి పరిచయం ఏర్పడి... అది కాస్త ప్రేమకు దారితీసిందని గీత పేర్కొన్నారు. వరంగల్​లో చదువుతున్న సమయంలో ప్రభాకర్ తన వెంటే ఉండేవాడని వెల్లడించింది. గతంలో పెద్దల సమక్షంలో పంచాయతీ జరిగినా తనకు న్యాయం జరగలేదని బాధితురాలు వాపోయింది. ప్రభాకర్​ను తాను ఎంతో నమ్మానని...తనను తీవ్ర నిర్లక్ష్యం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా అతనితోనే తన పెళ్లి జరిపించాలని గీత కోరుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి : యువకుల వాగ్వాదం... కత్తితో దాడి

ABOUT THE AUTHOR

...view details