ఖమ్మంలో తెదేపా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. టీడీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఎన్టీఆర్ కూడలిలో నల్ల బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. తెదేపా తరఫున గెలిచి.. పార్టీని వీడిన ఎమ్మెల్యేలు... ఆ పదవికి రాజీనామా చేసి తెరస తరఫున పోటీచేసి గెలవాలని ఖమ్మం తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
టీడీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ ఖమ్మంలో తెదేపా కార్యకర్తల నిరసన.. - టీడీఎల్పీ విలీననాన్ని నిరసిస్తూ ధర్నా
టీడీఎల్పీని తెరాసలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ ఖమ్మంలోని ఎన్టీఆర్ కూడలిలో తెదేపా కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద.. నోటికి నల్ల బ్యాడ్జి వేసుకుని నిరసన తెలిపారు.

tdp, khammam
ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా నినదించారు. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆధ్వర్యంలో పార్టీకి పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: తెరాసకే ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణం... కాంగ్రెస్ అభ్యంతరం