తెలంగాణ

telangana

ETV Bharat / state

చెప్పులతో కొట్టుకుంటూ..ముక్కు నేలకు రాసి నిరసన - rtc wokers strike updates in khammam

ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. డిపో నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. విలీనంపై వెనక్కి తగ్గినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనలేకపోవడం దారుణమన్నారు.

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన... బస్టాండ్ ఎదుట బైఠాయింపు

By

Published : Nov 17, 2019, 3:35 PM IST

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు బస్ రోకో నిర్వహించారు. డిపో నుంచి బస్టాండ్​ వరకు ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న బస్సును అడ్డుకుని దాని ముందు బైఠాయించారు. బస్సును తిరిగి బస్టాండ్​కు తిరిగి పంపించారు పోలీసులు. అనంతరం కార్మికులందరూ ముక్కును నేల రాసి నిరసన తెలిపారు. మహిళా కార్మికులు చెప్పులతో కొట్టుకుంటూ నిరసన తెలిపారు.

అనంతరం మయూరి కూడలిలో మానవహారం నిర్వహించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్​పై వెనక్కి తగ్గిన సర్కారు నుంచి సానుకూల స్పందన లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికుల ఆందోళన... బస్టాండ్ ఎదుట బైఠాయింపు

ఇవీచూడండి: దీక్షలు, ధర్నాలు, అరెస్టులు... రాష్ట్రం రణరంగం

ABOUT THE AUTHOR

...view details