ఖమ్మం జిల్లా ఏన్కూరులో గోరింట్ల రాధమ్మ అనే మహిళా రైతు ఆరెకరాల్లో నిమ్మ, జామ పంట వేసింది. కాయకొచ్చిన సమయంలో పంటకు నిప్పంటుకుని నిమ్మ తోటంతా దగ్ధమైంది.
ప్రకృతి విపత్తుతో నష్టాల్లో నిమ్మ రైతు
కరోనాతో ఎగుమతులు లేక పీకల్లోతు నష్టాల్లో కూరుకున్న ఉద్యాన రైతులకు ప్రకృతి విపత్తులు తోడవడం వల్ల కోలుకోలేని దెబ్బ తగులుతోంది. అకాల వర్షాలు, అగ్ని ప్రమాదాలతో కర్షుకులు కష్టాలపాలవుతున్నారు.
ప్రకృతి విపత్తుతో నష్టాల్లో నిమ్మ రైతు
రాత్రి వేళలో వరిపొలాల్లో అంటించిన నిప్పుకు గాలి తోడై నిమ్మతోట వైపు దారితీసింది. చేతికొచ్చిన నిమ్మకాయలు బూడిదపాలయ్యాయి. తమను ఆదుకోవాలని రైతు రాధమ్మ ప్రభుత్వాన్ని కోరింది.