మూడోదశ ప్రాదేశిక ఎన్నికలకు ఖమ్మం జిల్లా అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆయా మండల కేంద్రాలకు పోలింగ్ సామాగ్రీని పంపిణి చేశారు. జిల్లా వ్యాప్తంగా 7 జడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఒక్క ఎంపీటీసీ ఏకగ్రీవం కాగా... 259 మంది అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు బరిలో నిలవగా.. 7 జడ్పీటీసీ స్థానాలకుగాను 30 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఖమ్మం రఘనాథపాలెం మండలంలోలోని 14 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల అధికారులు పోలింగ్ సామాగ్రీని పంపిణి చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం - ZPTC
మూడోదశ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఖమ్మం జిల్లాలో రేపు జరగబోయే పోలింగ్కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 7 జడ్పీటీసీ, 91 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం