తెలంగాణ

telangana

By

Published : Feb 24, 2020, 1:18 PM IST

ETV Bharat / state

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మహిళల నిరసన

ఎన్నికల సమయంలో వారం రోజులు మాత్రమే తాగునీటి సరఫరా చేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ క్యాంపు కార్యాలయం ఎదుట మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

womens protest for water
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మహిళల నిరసన

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ క్యాంపు కార్యాలయం ముందు మహిళలు కాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. పుష్కర కాలంగా ఇందిరమ్మ కాలనీలో సమస్యలు పరిష్కరించడం లేదని వాపోయారు. 2008లో నివాస స్థలాలు కేటాయించగా ఇళ్లు నిర్మించుకొని నివసిస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరా, విద్యుత్ కనెక్షన్, మరుగుదొడ్లు మంజూరు చేయాలని కోరారు.

ఎన్నికల సమయంలో వారం రోజులు తాగునీటి సరఫరా చేసి నిలిపివేశారని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంఖ్య రవిశంకర్ చేరుకొని మహిళలను సముదాయించారు. ఇందిరమ్మ కాలనీలో సమస్యలు పరిష్కరిస్తామని హామీనిచ్చారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మహిళల నిరసన

ఇవీ చూడండి:నమస్తే ట్రంప్​: జనసంద్రంలా మోటేరా స్టేడియం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details