హరితహారంలో భాగంగా నాటుతున్న ప్రతి మొక్కను రక్షించాలని రాష్ట్ర రోడ్డు భద్రత డీజీపీ కృష్ణప్రసాద్, కరీంనగర్ పోలీస్ కమిషన్ వీబీ కమలాసన్రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా కమిషనరేట్ ఆవరణలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. పోలీస్ శాఖ ఇప్పటి వరకు కోటి 20 లక్షల మొక్కలను నాటి.. వాటి బాధ్యతను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. పోలీస్ శిక్షణా కళాశాలల్లో మొక్కలు నాటి రక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు.
కమిషనరేట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం
కరీంనగర్ జిల్లా కమిషనరేట్ ఆవరణలో రాష్ట్ర రోడ్డు భద్రత డీజీపీ కృష్ణప్రసాద్, కరీంనగర్ సీపీ కమలాసన్రెడ్డి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
కమిషనరేట్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం