తెలంగాణ

telangana

ETV Bharat / state

'అమిత్ షా వీధి పోరాటాలు తెలంగాణకు ఏమొద్దు' - TRS

"అమిత్ షా... భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అనే విషయం మరిచిపోయారు. అందుకే పదిహేను రోజులకొకసారి తెలంగాణలో వీధి పోరాటాలు చేస్తానంటున్నారు": వినోద్ కుమార్, మాజీ ఎంపీ

అమిత్ షా వ్యాఖ్యలపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ అసంతృప్తి

By

Published : Jul 8, 2019, 3:11 PM IST

Updated : Jul 8, 2019, 3:16 PM IST

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన స్థాయిని మరిచి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం సమంజసం కాదని కరీంనగర్‌ మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతీ పార్టీ రాజకీయంగా ఎదగడానికి సభ్యత్వాలు నమోదు చేయడం సర్వసాధారణమని ఆయన పేర్కొన్నారు. అమిత్‌ షా... పార్టీ అధ్యక్షుడే కాక కేంద్రహోం మంత్రి అనే విషయం మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ప్రతి పదిహేను రోజులకొకసారి తెలంగాణాకు వచ్చి వీధిపోరాటాలు చేస్తాననడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రజలు శాంతి, అభివృద్దిని కోరుకుంటారే తప్ప వీధిపోరాటాలు కాదని విమర్శించారు. పదిహేనురోజులకొకసారి ఇక్కడికి రావడం కాదు ముందు కేంద్ర జలవనరుల శాఖమంత్రి మంత్రిని పంపించి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేందుకు కృషి చేయాలని వినోద్‌కుమార్ సూచించారు.

అమిత్ షా వ్యాఖ్యలపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ అసంతృప్తి
Last Updated : Jul 8, 2019, 3:16 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details