తెలంగాణ

telangana

By

Published : Feb 7, 2020, 10:24 AM IST

ETV Bharat / state

అగ్ని ప్రమాదంతో గుడిసె దగ్ధం

షార్ట్​ సర్క్యూట్​తో ఓ పూరి గుడిసె పూర్తిగా కాలిపోయిన ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

The hut fire by fire
అగ్ని ప్రమాదంతో గుడిసె దగ్ధం

కామారెడ్డి జిల్లాలోని రామేశ్వర్​పల్లి తండాలో విషాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్​ వల్ల గుగ్లోత్ బాల్​సింగ్ గుడిసె దగ్ధమైంది. ఇంట్లో సమాన్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. గుడిసెలో దాచుకున్న 75 వేల నగదు, అమ్మకం కోసం ఉంచిన సుమారు 40 క్వింటాళ్ల బియ్యం, 2 తులాల బంగారం, 13 తులాల వెండి కాలిపోయాయి.

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు పంచనామా నిర్వహించారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అగ్ని ప్రమాదంతో గుడిసె దగ్ధం

ఇదీ చదవండి:మద్యం ఊరికే రాదు... మరి ఇలా కుళాయిల్లో వస్తే.!

ABOUT THE AUTHOR

...view details