కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం కేంద్రంలో లాక్డౌన్తో అవస్థలు పడుతున్న వారికి పీఆర్టీయూ, కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీల ఆధ్వర్యంలో వేర్వేరుగా నిత్యావసరాలను పంపిణీ చేశారు.
పేదలకు నిత్యావసరాలు పంచిన గంప గోవర్ధన్...
పీఆర్టీయూ ఆధ్వర్యంలో చేపట్టిన నిత్యావసరాల పంపిణీ కార్యక్రమంలో కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పాల్గొన్నారు. సుమారు 230 మందికి నెలకు సరిపడా సరుకులను ఎమ్మెల్యే అందజేశారు. కనిపించని శత్రువుతో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు యుద్ధం చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. వారిని ఆదుకునేందుకు 16 గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు, ఆశ కార్యకర్తలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామన్నారు.