తెలంగాణ

telangana

By

Published : Sep 29, 2019, 4:18 PM IST

ETV Bharat / state

జోగులాంబ ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

అలంపూర్‌ జోగులాంబ ఆలయంలో దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో  పాల్గొన్నారు.

జోగులాంబ ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ జోగులాంబ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉత్సవాల్లో జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దేవి శరన్నవరాత్రి పూజల్లో భాగంగా మొదటి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో ప్రేమ్ కుమార్ అమ్మవారి పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో బాజా భజంత్రీల నడుమ ఆలయానికి చేరుకుని సమర్పించారు. అనంతరం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, మహా కలశస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు.

జోగులాంబ ఆలయంలో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details