తెలంగాణ

telangana

By

Published : Sep 8, 2020, 8:02 PM IST

ETV Bharat / state

తమ అభిమాన నేత కోలువాలంటూ ప్రత్యేక పూజలు..

ఏఐఎఫ్​బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు కరోనా బారినపడిన విషయం విధితమే. కాగా అతను త్వరగా కోలుకోవాలని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కోటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపించారు.

Fans held special pujas to demand recovery from AIFB leader Corona in jayashankar district
తమ అభిమాన నేత కోలువాలంటూ ప్రత్యేక పూజలు..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జిల్లా ఇంఛార్జి, ఏఐఎఫ్​బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణ రావు కరోనా నుంచి కోలుకోవాలని పూజలు నిర్వహించారు. అతను అహర్నిశలు ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటూ అందరికీ అందుబాటులో ఉంటూ, 108గా పని చేయడం వల్ల కరోనా బారినపడ్డారని రేగొండ మండల అధ్యక్షుడు కిష్టయ్య తెలిపారు.

అందుకే తమ ప్రియతమ నేత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తొందరగా కోలుకోవాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ఆయనపై ఉండాలని అని పూజలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎఫ్​బీ పార్టీ నాయకులు గైకోటి రవీందర్, ముల్కనూర్ భిక్షపతి, కాశెట్టి రాజయ్య, నిమ్మల విజేందర్, సురేందర్, కొంయ్యడ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:పీవీ గ్లోబల్ ఇండియా రూపశిల్పి.. : కేసీఆర్‌

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details