జయశంకర్ భూపాలపల్లిలో జిల్లాలో చెపట్టనున్న మెఘా అవెన్యూ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ సూచించారు.
గ్రామీణ అభివృద్ధి, పంచాయతీ, అటవీ, మున్సిపల్ శాఖల అధికారులు, ఎంపీడీవోలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. హరితజయ-2020 కార్యక్రమం ద్వారా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డు స్థాయిలో జిల్లాలో గల రహదారుల వెంట ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఒక గంట సమయంలో ఒక లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు.