జనగామ జిల్లా పాలనాధికారి వినయ్ కృష్ణారెడ్డి తరిగొప్పుల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ రాకను గమనించిన స్థానికులు తమ సమస్యలు చెప్పుకునేందుకు యత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళనను అధికారులు నీరుగారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కావాలనే అధికారులు తమ భూములు పట్టాలు చేయట్లేదని కలెక్టర్కు మొరపెట్టుకున్నారు.
కలెక్టర్ వార్నింగ్..! - REDDY
రైతుల సమస్యలు.... అధికారుల చోద్యాలు... కలెక్టర్ ఆకస్మిక తనిఖీతో బట్టబయలయ్యాయి. అన్నీ ఆలకించిన పాలనాధికారి... అటు బాధితులకు భరోసా, ఇటు అధికారులకు హెచ్చరికలతో అదరగొట్టారు.

అధికారులకు గడువు...రైతులకు భరోసా
రైతులకు భరోసా..అధికారులకు హెచ్చరిక
వారంలోపు పూర్తి చేయాలి..!
రైతుల సమస్యలు ఆలకించిన కలెక్టర్ అధికారులను నిలదీశారు. వారం రోజుల్లో మళ్లీ పరిశీలనకు వస్తానని, అప్పటిలోపు పెండింగ్ ఫైల్స్ పూర్తి చేయాలని సూచించారు. రైతులెవరూ నిరాశచెందొద్దని భరోసా ఇచ్చారు.
ఇదీ చదవండి:కిల్లర్ లేడీ
Last Updated : Feb 28, 2019, 1:25 PM IST