జగిత్యాల జిల్లా మండల కేంద్రంలోని నర్సింగాపూర్లో పల్లె ప్రకృతివనం అందుబాటులోకి వచ్చింది. రెండెకరాల విస్తీర్ణంలో 5,800 మొక్కలు నాటారు. చెట్ల గొప్పతనాన్ని తెలిపే బొమ్మలతో ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తోంది. రంగు రంగుల పూల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.
పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్కుమార్
జగిత్యాల జిల్లా కేంద్రం నర్సింగాపూర్లో పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ప్రకృతి వనాన్ని ప్రారంభించారు.
పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్కుమార్
జిల్లాలో తొలిసారిగా పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్కుమార్ అన్నారు. పల్లెల్లో ఆహ్లాదం పంచటంతో పాటు పర్యావరణానికి పల్లె ప్రకృతి వనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'మీరు చెప్పింది చేస్తే... మిమ్మల్ని సన్మానిస్తాం'