తెలంగాణ

telangana

By

Published : Sep 22, 2020, 5:05 PM IST

ETV Bharat / state

పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్​కుమార్​

జగిత్యాల జిల్లా కేంద్రం నర్సింగాపూర్​లో పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి వచ్చింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు దావ వసంతతో కలిసి ప్రకృతి వనాన్ని ప్రారంభించారు.

పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్​కుమార్​
పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్​కుమార్​

జగిత్యాల జిల్లా మండల కేంద్రంలోని నర్సింగాపూర్​లో పల్లె ప్రకృతివనం అందుబాటులోకి వచ్చింది. రెండెకరాల విస్తీర్ణంలో 5,800 మొక్కలు నాటారు. చెట్ల గొప్పతనాన్ని తెలిపే బొమ్మలతో ప్రత్యేక ఆకర్షణగా దర్శనమిస్తోంది. రంగు రంగుల పూల మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి.

జిల్లాలో తొలిసారిగా పల్లె ప్రకృతి వనం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే సంజయ్​కుమార్​ అన్నారు. పల్లెల్లో ఆహ్లాదం పంచటంతో పాటు పర్యావరణానికి పల్లె ప్రకృతి వనాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:'మీరు చెప్పింది చేస్తే... మిమ్మల్ని సన్మానిస్తాం'

ABOUT THE AUTHOR

...view details