తెలంగాణ

telangana

By

Published : Feb 6, 2021, 5:38 PM IST

ETV Bharat / state

ధర్మపురి నారసింహుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి దర్శించుకున్నారు. స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు.

High Court Judge Justice Sridevi visited Dharmapuri Lakshmi Narasimha Swamy temple in Jagtial district with family
ధర్మపురి నారసింహుని సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీదేవి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. జగిత్యాల కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సుదర్శన్, జస్టిస్ వెంకటేశ్వర్, ఎస్పీ సింధుశర్మ, కలెక్టర్ రవి ఆమె వెంట ఉన్నారు. అంతకుముందు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details