హైదరాబాద్ బంజారాహిల్స్కు చెందిన ఖుష్ లోహియా(24) తల్లితో కలిసి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ సందర్శనకు వెళ్లింది. ప్రైవేటు సెక్యూరిటీకి చెందిన మహిళా సిబ్బంది ఆమెను తనిఖీ చేశారు. సిగరెట్ పెట్టె లభించగా.. లోనికి అనుమతించేదు. దీంతో వాగ్వాదానికి దిగిన యువతి.. సిబ్బంది సునీత, సుజాతపై పిడిగుద్దులు కురిపించింది. దీంతో స్వల్ప గాయాలు కాగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బేగంబజార్ పోలీసులు సదరు యువతిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేశారు.
సిగరెట్ పెట్టె వద్దన్నందుకు కొట్టింది!
సిగరెట్ పెట్టెతో లోపలికి వెళుతున్న.. ఓ యువతిని సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. దీంతో రెచ్చిపోయిన ఆమె సెక్యూరిటీ మహిళపై పిడిగుద్దులు కురిపించింది. ఇది జరిగింది ఎక్కడో కాదు.. మన హైదరాబాద్లోనే.
సిగరెట్ పెట్టె వద్దన్నందుకు యువతి దాడి