కుటుంబీకులు పట్టించుకోవడం లేదని ఏపీలోని విశాఖ జిల్లా కంచరపాలెం పోలీసులను ముగ్గురు చిన్నారులు ఆశ్రయించారు. కొన్నేళ్లక్రితం తల్లి చనిపోవడంతో, తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో వారు అమ్మమ్మ వద్ద ఉన్నారు. ఈ క్రమంలో చిన్నారులను పోషించడం భారంగా ఉందని... వారి అమ్మమ్మ బయటకు పంపించేసింది. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు కంచరపాలెం పోలీస్ స్టేషన్కు వచ్చారు.
Children approach Police For shelter: అయినవాళ్లు గెంటేశారు... పోలీసులను ఆశ్రయించారు - children complaint on their family members in kancharapalem
ఏపీలోని విశాఖ జిల్లా కంచరపాలెంలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తల్లి చనిపోవడంతో తమను ఆదరించే వారు ఎవరూ లేరంటూ ముగ్గురు చిన్నారులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనతో విస్తుపోయిన పోలీసులు... చైల్డ్ లైన్ సహకారంతో హోమ్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Childrens request for help
వీరి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు... చైల్డ్ లైన్ సహకారంతో హోమ్కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. దాతలు ముందుకొచ్చి సహాయం చేస్తే చదువుకుంటామని చిన్నారులు అభ్యర్థిస్తున్నారు.