How to Apply Single Women Pension Scheme in Telangana:నిరుపేద కుటుంబాలకు చెందిన ఒంటరి మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం "సింగిల్ ఉమెన్" పింఛను పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకాన్ని 2017, జూన్2 వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించారు. ఈ పథకం కింద మొదటి దశలో ఒంటరి మహిళలకు వెయ్యి రూపాయలు అందించగా.. తరువాత దానిని 2వేల 16 రూపాయలకు పెంచారు. మరి ఈ సాయం పొందేందుకు అర్హులు ఎవరు? నిబంధనలేంటి? దరఖాస్తు ఎలా చేయాలి..? అనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సింగిల్ ఉమెన్ పింఛన్కు అర్హులు ఎవరు..?
Who is Eligible For Single Women Pension:
- వివాహిత: 18 ఏళ్ల వయస్సు నిండి పెళ్లి అయ్యాక భర్త నుంచి విడిపోయి వేరుగా ఉన్న వారు ( కనీసం ఏడాది కాలానికి పైగా )
- అవివాహిత: వివాహం చేసుకోని మహిళలు. గ్రామీణులైతే 30 ఏళ్లు, పట్టణ వాసులైతే 35 సంవత్సరాలు నిండి ఉండాలి.
- కుటుంబ వార్షిక ఆదాయం: గ్రామీణులైతే లక్షా 50 వేలు, పట్టణవాసులైతే రూ. 2 లక్షలకు మించరాదు.
- లబ్ధిదారులు ప్రభుత్వ ఇతర పథకాల ద్వారా పింఛన్ పొందరాదు.
- ప్రభుత్వ, ప్రయివేటు సంస్థల ద్వారా పింఛన్ అందుకునే వారు కూడా అనర్హులు.
- 57 ఏళ్ల వయస్సు నిండితే.. వృద్ధాప్య పింఛన్కు అర్హులవుతారు.
- ఒకవేళ సదరు మహిళ పెళ్లి చేసుకున్నా.. శాశ్వత ఉద్యోగం సంపాదించుకున్నా..ఈ పెన్షన్ నిలిచిపోతుంది.
How to Apply for Aasara Pension : ఆసరా పింఛన్.. ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా..?