తెలంగాణ

telangana

ETV Bharat / state

YS Sharmila Tweet on KCR : 'రైతులకు బేడీలు.. అబ్​​​ కీ బార్‌ కిసాన్ సర్కార్‌ అంటే ఇదేనా దొర' - Sharmila on Handcuffs To Farmers in Yadadri

YS Sharmila Comments on KCR : యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వైఎస్ షర్మిల ఖండించారు. నమ్ముకున్న భూమిని ఇచ్చేది లేదన్న అన్నదాతలకు బేడీలు వేయడమా మీరిచ్చే భరోసా అని కేసీఆర్​ను ప్రశ్నించారు. మీ బందిపోట్లను ప్రశ్నిస్తే కర్షకులని చూడకుండా జైలుకు పంపడమేనా.. బీఆర్ఎస్​ నినాదమంటూ వైఎస్ షర్మిల దుయ్యబట్టారు.

YS Sharmila
YS Sharmila

By

Published : Jun 14, 2023, 5:27 PM IST

Sharmila Respond on Handcuffs To Farmers in Yadadri : యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతులకు బేడీలు వేసి పోలీసులు కోర్టుకు తీసుకువచ్చిన తీరును ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఖండించాయి. ఈ క్రమంలోనే దీనిపై వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విటర్ వేదికగా స్పందించారు. దొర పాలనలో న్యాయమడిగిన అన్నదాతకు తప్పని సంకెళ్లంటూ కేసీఆర్​పై విమర్శనాస్త్రాలు సంధించారు. అబ్​​​ కీ బార్‌ కిసాన్ సర్కార్‌ అంటే ఇదేనా దొర అంటూ కేసీఆర్​ని సంబోధిస్తూ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు.

YS Sharmila Comments on KCR :నమ్ముకున్న భూమిని ఇచ్చేది లేదన్న రైతులకు బేడీలువేయడమా మీరిచ్చే భరోసా అంటూ కేసీఆర్​పై.. వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు. మీ బందిపోట్లను ప్రశ్నిస్తే అన్నదాత అని చూడకుండా జైలుకు పంపడమేనా.. బీఆర్ఎస్​ నినాదమంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో మద్దతు ధర అడిగితే సంకెళ్లు.. పంట కొనండని అడిగితే సంకెళ్లు.. భూములు పోయాయని అడిగితే సంకెళ్లు.. భూములు ఇవ్వమని చెప్పినా సంకెళ్లు అని వైఎస్ షర్మిల ఆరోపించారు.

ఏది చూసినా అన్నదాతకు దొర ఇచ్చే గిఫ్ట్‌ సంకెళ్లంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. కిసాన్ భరోసా అని.. వచ్చేది రైతు ప్రభుత్వమని చెప్పుకునేందుకు కేసీఆర్ సిగ్గుపడాలని దుయ్యబట్టారు. మీది భరోసానిచ్చే సర్కారు కాదని.. రైతుకు బేడీలు వేసే సర్కారు అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి పేర్కొన్నారు. దేశ చరిత్రలో రైతులను మూడు సార్లు జైలుకు పంపిన చరిత్ర మీదే అంటూ ఎద్దేవా చేశారు. భూములు పోతున్నాయి మహాప్రభో అని నిరసన తెలిపితే అరెస్టులు చేయిస్తారా అంటూ అగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila Fires on KCR :అరెస్టులు చేయాల్సింది కర్షకులను కాదని.. భూములు మింగే దొర కేసీఆర్​ని అరెస్ట్ చేయాలని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ దొంగలకు అనువుగా ఆర్​ఆర్​ఆర్​ అలైన్‌మెంట్ మార్చిన ముఖ్యమంత్రిని జైలుకు పంపాలన్నారు. న్యాయమని అడిగిన అన్నదాతలకు బేడీలు వేస్తున్న.. నీ నియంత పాలనకు రోజులు దగ్గర పడ్డాయని కేసీఆర్​ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఆ సంకెళ్లు సీఎంకు వేసేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు.

అసలేం జరిగిదంటే : గత నెల 30న యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌ వద్ద రీజినల్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ మార్చాలంటూ పలువురు అన్నదాతలు, రాజకీయ పార్టీల నాయకులు ఆందోళ చేపట్టారు. అదే రోజు రాత్రి పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ క్రమంలోనే మంగళవారం జైలు నుంచి కోర్టుకు తీసుకువచ్చే సమయంలో రైతులకు సంకెళ్లు వేయటం చర్చనీయంగా మారింది. పోలీసుల తీరును ఖండించిన రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అయితే మరోవైపు దీనిపై స్పందించిన భువనగిరి డీసీపీ అరెస్టైన వారిలో రైతులే లేరని పేర్కొన్నారు.

ఇవీ చదవండి :కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు: షర్మిల

YS Sharmila on Palamuru project : 'పాలమూరు ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమా.. ?'

ABOUT THE AUTHOR

...view details