తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎస్​బీఐ సీజీఎం ఓం ప్రకాష్​ మిశ్రాకు పదోన్నతి - ఓం ప్రకాష్​ మిశ్రాకు పదోన్నతి

ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓం ప్రకాష్‌ మిశ్రాకు, సర్కిల్‌ జనరల్‌ మేనేజర్‌ అజయ్‌కుమార్‌ సింగ్‌కు పదోన్నతి లభించింది. ఓం ప్రకాష్‌ మిశ్రాకు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు.

sbi cgm omprakash mishra
ఎస్​బీఐ సీజీఎం ఓం ప్రకాష్​ మిశ్రాకు పదోన్నతి

By

Published : May 15, 2021, 12:30 AM IST

ఎస్‌బీఐ హైదరాబాద్‌ సర్కిల్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఓం ప్రకాష్‌ మిశ్రాకు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా, సర్కిల్‌ జనరల్‌ మేనేజర్‌ అజయ్‌కుమార్‌ సింగ్‌కు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌గా ఇద్దరు అధికారులకు ఇవాళ పదోన్నతి లభించింది. ఓం ప్రకాశ్​ మిశ్రా 2019 మేలో భారతీయ స్టేట్ బ్యాంక్ హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్​గా వచ్చారు. మిశ్రా 1987లో పాట్నా సర్కిల్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా నియమితులయ్యారు. ఆయన వివిధ హోదాల్లో పనిచేసి బ్యాంకింగ్ రంగంలో గొప్ప అనుభవాన్ని పొందారు. మిశ్రా హైదరాబాద్​కు రాక ముందు గౌహతి, దిల్లీ సర్కిల్ జనరల్ మేనేజర్‌గా పనిచేశారు.

అదేవిధంగా అజయ్ కుమార్ సింగ్ 1991లో పాట్నా సర్కిల్ ప్రొబేషనరీ అధికారిగా బ్యాంక్​లో చేరారు. హైదరాబాద్ రాక ముందు ముంబై కార్పొరేట్ సెంటర్, గౌహతి సర్కిల్​లో వివిధ హోదాల్లో పని చేశారు.

ఇదీ చదవండి: నేడు, రేపు కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details