రాష్ట్రంలో ఇప్పటి వరకు 88 శాతం మంది రేషన్ లబ్ధిదారులకు 12 కిలోల చొప్పున పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. మొత్తం మీద 3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 17 వేల రేషన్ దుకాణాల ద్వారా 76 లక్షల కార్డుదారులకు అందించినట్లు పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రేషన్ పోర్టబిలిటీ ద్వారా 13 లక్షల లావాదేవీలు జరిగినట్లు వివరించారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్లో 2.42 లక్షలు, మేడ్చల్ జిల్లాలో 1.95 లక్షలు, రంగారెడ్డి జిల్లాలో 1.36 లక్షల మంది పోర్టబిలిటీ ద్వారా బియ్యం తీసుకున్నారన్నారు.
సాఫీగా బియ్యం పంపిణీ...