చిగురుపాటి జయరామ్ హత్య కేసులో ప్రధాన నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. వీరిని మూడు రోజుల పాటు విచారించనున్నారు.
పోలీసు కస్టడీకి రాకేష్ రెడ్డి
పోలీసు కస్టడీకి రాకేష్ రెడ్డి
పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ హత్య కేసులో విచారణ వేగవంతమైంది. ప్రధాననిందితులుగా భావిస్తున్న రాకేష్రెడ్డి, శ్రీనివాసులను జూబ్లీహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఉదయం చంచల్గూడ జైలు నుంచి జూబ్లీహిల్స్ పీఎస్కు తరలించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు మూడు రోజులపాటు వీరిని విచారించిన అనంతరం తిరిగి కోర్టులో హాజరుపర్చనున్నారు.