రాష్ట్రంలో తెరాస జెండా కప్పుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని... సీనియర్ నాయకుడు, వైఎస్ షర్మిల అనుచరుడు కొండా రాఘవరెడ్డి ఆరోపించారు. ఈ నెల 8న లోటస్ పాండ్లో భారీ ఎత్తున మహిళ దినోత్సవం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
'తెరాస జెండా కప్పుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు'
ఈ నెల 8న లోటస్ పాండ్లో భారీ ఎత్తున మహిళ దినోత్సవం నిర్వహిస్తామని... వైఎస్ షర్మిల ప్రధాన అనుచరుడు, సీనియర్ నేత కొండా రాఘవరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో తెరాస జెండా కప్పుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని ఆయన ఆరోపించారు.
'తెరాస జెండా కప్పుకున్న వారికి మాత్రమే సంక్షేమ పథకాలు'
మహబూబ్నగర్ జిల్లాలో వైఎస్ఆర్ 95 శాతం ప్రాజెక్టులను పూర్తి చేస్తే... మిగిలిన ఐదు శాతం పనులను తెరాస ప్రభుత్వం పూర్తిచేయలేకపోతోందని ఆయన ఆరోపించారు. ఇప్పటివరకు రంగారెడ్డి, నల్గొండ, హైదరాబాద్ మహబూబ్నగర్ జిల్లా నేతలతో వైఎస్ షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారని తెలిపారు.
ఇదీ చదవండి: యువతిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది