నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో దారుణం చోటుచేసుకుంది. తనకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ సూపరిండెంట్ కాళ్లను మొక్కింది. ఆసుపత్రిలో ఒక బాలికకు రెండు సార్లు చేతికి ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఫెయిలయ్యారు. డాక్టర్ల తప్పిదాన్ని వేలెత్తి చూపిన బాధిత కుటుంబ సభ్యులపై వైద్య సిబ్బంది చిందులు వేశారు.
'రెండుసార్లు ఆపరేషన్ చేయటంలో విఫలమైన వైద్యులు.. ప్రశ్నిస్తే ఎదురుతిరిగిన వైనం'
ఆపరేషన్ చేయటంలో.. ఒకసారి కాదు రెండు సార్లు విఫలమైన వైద్యులు.. ప్రశ్నించిన బాధిత కుటుంబసభ్యుల పైకే ఎదురుదాడికి దిగారు. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో.. న్యాయం చేస్తామంటూ దిగివచ్చారు. ఈ ఘటన నాచారంలోని ఈఎస్ఐ ఆస్పత్రిలో చోటు చేసుకుంది.
విఫలమైన వైద్యులు
బాధిత కుటుంబ సభ్యులు నాచారం పోలీసులను ఆశ్రయించగానే, వారికి న్యాయం చేస్తామంటూ ఈఎస్ఐ వైద్యులు దిగివచ్చారు.