అనుమతులు లేని, అనధికారిక ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణపై.. నగర, పురపాలికల్లో విస్తృత అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని తెలంగాణ పురపాలకశాఖ స్పష్టం చేసింది. ఇదే చివరి అవకాశమని, భవిష్యత్తులో అనుమతులు లేని స్థలాలు రిజిస్ట్రేషన్లు చేయరని వెల్లడించింది.
నిర్మాణాలు, తాగునీరు, డ్రైనేజీకి అనుమతులు ఉండబోవనే విషయాన్ని అవగాహన కార్యక్రమాల్లో ప్రజలకు వివరించాలని పురపాలకశాఖ తెలిపింది. క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిన... ప్లాట్లు, లేఅవుట్ల యజమానుల వివరాలు సబ్ రిజిస్ట్రార్ల నుంచి తీసుకోవాలని సూచించింది. అనుమతులు లేని స్థలాల యజమానులతో.. వార్డుల వారీ సమావేశాలు నిర్వహించాలని పురపాలకశాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.