రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్యను ప్రభుత్వం సక్రమంగా చూపడం లేదని ఎంపీ రేవంత్రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. గురువారం మొత్తం కేసులు 18,570 అని హెల్త్ బులిటెన్లో చూపించారని... అదే లైవ్ డ్యాష్ బోర్డులో మాత్రం 21,393 అని చూపిస్తోందని ఆరోపించారు. హెల్త్ బులిటెన్కి వాస్తవాలకు దాదాపు 3,000 కేసుల తేడా ఉందని పేర్కొన్నారు. కరోనా కేసుల సంఖ్య విషయంలో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలనుకుంటున్నారని తెలిపారు. మంత్రి ఈటల రాజేందర్ వాస్తవ లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కరోనా కేసుల సంఖ్యను సక్రమంగా చెప్పడం లేదు: ఎంపీ రేవంత్రెడ్డి - ప్రభుత్వంపై రేవంత్ ఫైర్
రాష్ట్రంలో కరోనా కేసులకు సంబంధించి హెల్త్ బులిటెన్కు వాస్తవాలకు దాదాపు 3వేల కేసుల తేడా ఉందని ఉందని ఆరోపించారు మాల్కాజిగిరి ఎంపీ రేవంత్రెడ్డి. వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టమైన లెక్కలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా కేసుల సంఖ్యను సక్రమంగా చెప్పడం లేదు: రేవంత్రెడ్డి