ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ముషీరాబాద్ శాసనసభ్యులు ముఠా గోపాల్ అన్నారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు ఆయన నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించటమే తమ ధ్యేయమని వెల్లడించారు. ప్రభుత్వం సూచించిన విధివిధానాలను ప్రజలు అనుసరించాలని ఆయన కోరారు. అనవసరంగా బయటికి వచ్చి పోలీసు సిబ్బందిని ఇబ్బందులకు గురి చేయవద్దని ప్రజలకు వివరించారు.
'స్వచ్ఛంద సంస్థల కృషి భేష్'
ముషీరాబాద్ నియోజకవర్గంలో పేద ప్రజలను ఆదుకోవడానికి స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న కృషి అభినందనీయమని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ప్రస్తుత సేవ చేయాల్సిన అవసరం అందరిపై ఉందన్నారు.
'స్వచ్ఛంద సంస్థల కృషి భేష్'
TAGGED:
'స్వచ్ఛంద సంస్థల కృషి భేష్'