Harish rao on Conservation of Rivers: నదుల పరిరక్షణ, నదుల పునరుద్ధరణపైనే సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. తెలంగాణలో మిషన్ కాకతీయను ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్తున్నారని వెల్లడించారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నదుల పరిరక్షణపై జరుగుతున్న జాతీయ సదస్సులో.. రెండోరోజు మంత్రి హరీశ్ పాల్గొన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా నేలపై పడిన ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపట్టి ఆయకట్టు పెంచుకున్నామని హరీశ్ చెప్పారు. ఈ పథకం ద్వారా 46 చెరువులను పునరుద్ధరించుకున్నట్లు వివరించారు.
నదులను కాపాడుకోవాలి
"రాష్ట్రంలో కుంభవృష్టి వర్షాలు పడినా ఎక్కడా చెరువులు తెగలేదు. 4వేల చెక్ డ్యామ్లను రూ.6 వేల కోట్లతో నిర్మించుకున్నాం. తద్వారా భూగర్భజలాలు పెరిగాయి. ఏడాది పొడవునా చెరువులను వినియోగంలోకి తీసుకొచ్చాం. పట్టుదల ఉంటే కానిది ఏదీ లేదని సీఎం కేసీఆర్ నిరూపించారు. భవిష్యత్తు తరాల కోసం.. నదులను కాపాడుకోవాలి." -హరీశ్ రావు, ఆర్థిక శాఖ మంత్రి