తెలంగాణ

telangana

ETV Bharat / state

'యువకుడి శిరోముండనం విషయంలో మంత్రి వనితను అడ్డుకున్న ప్రజాసంఘాలు' - మంత్రి వనితను యువకుడి శిరోముండనం కేసు విషయంలో ప్రజా సంఘాలు నిలదీశాయి

ఏపీ తూర్పుగోదావరి జిల్లాలో యువకుడి శిరోముండనం వ్యవహారంలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నేతలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసులపై ఇప్పటికే చర్యలు తీసుకున్నామని... నిందితులు ఎవరైనా చర్యలు తప్పవని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు.

minister-consulted-the-rape-victim-at-rajamahendravaram
'యువకుడి శిరోముండనం విషయంలో మంత్రి వనితను అడ్డుకున్న ప్రజాసంఘాలు'

By

Published : Jul 22, 2020, 8:17 PM IST

ఏపీ తూర్పు గోదావరి జిల్లాలో యువకుడి శిరోముండనం వ్యవహారంలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని బీఎస్పీ, పలు సంఘాలు డిమాండ్ చేశాయి. బాధిత యువకుడు ప్రసాద్​ను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం ఆసుపత్రి వద్దకు జక్కంపూడి రాజా, మేరుగ నాగార్జునతో కలిసి వచ్చిన స్త్రీ శిశు, సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితను స్థానిక ప్రతినిధులు నిలదీశారు.

'యువకుడి శిరోముండనం విషయంలో మంత్రి వనితను అడ్డుకున్న ప్రజాసంఘాలు'

శిరోముండనం చేసేందుకు పోలీసులపై ఒత్తిడి తెచ్చిన కవల కృష్ణమూర్తి సంగతేంటని మంత్రిని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తామని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన పోలీసులపై ఇప్పటికే చర్యలు తీసున్నామని... నిందితులు ఎవరైనా చర్యలు తప్పవని మంత్రి వనిత చెప్పారు.

అంతకుముందు ఇటీవల అత్యాచారానికి గురైన బాధితురాలిని మంత్రి వనిత పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిందితులకు శిక్ష పడుతుందని భయపడవద్దని సూచించారు.

ఇదీ చూడండి :ప్రభుత్వం ఐసీఎంఆర్ మార్గదర్శకాలను లెక్కచేయట్లేదు: రాంచందర్‌ రావు

ABOUT THE AUTHOR

...view details