లాక్డౌన్లో ఇచ్చిన సడలింపులతో వేర్వేరు రాష్ట్రాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీలు స్వస్థలాలకు తరలివెళ్తున్నారు. దీనికి భిన్నంగా పలు రాష్ట్రాల నుంచి కొందరు వలస కూలీలు తెలంగాణకు చేరుకుంటున్నారు. ప్రత్యేక రైలులో బిహార్లోని ఖగారియా నుంచి సుమారు 225 మంది కూలీలు హైదరాబాద్ లింగంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకున్నారు.
వలస కూలీలకు స్వాగతం
వలస కూలీలకు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పౌరసఫరాల ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, రంగారెడ్డి జిల్లా అజయ్కుమార్, నోడల్ అధికారి సందీప్ సుల్తానియా తదితరులు స్వాగతం పలికారు. రైలులో వచ్చిన వారందరికీ ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆహార పొట్లాలు, తాగు నీరు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు.