ఎల్ఆర్ఎస్పై జీవో 131ను తక్షణమే ఉపసంహరించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. కరోనా మహమ్మారితో ప్రజలు ఉపాధి కోల్పోయి తిండిలేక పస్తులు ఉంటే ప్రభుత్వం ప్రజల నెత్తిపై ఎల్ఆర్ఎస్ భారం మోపడం దారుణమని కమిటీ తీవ్రంగా మండిపడింది. సుమారు 70, 80 ఏళ్ల నుంచి నివాసముంటున్న స్థలాలను కూడా క్రమబద్ధీకరించుకోవాలంటూ ఆదేశాలు జారీ చేయడం అనైతికమని సీపీఎం నేత జి.నాగయ్య పేర్కొన్నారు.
ఆ తరగతుల వారిపై భారం..
ఈ దుశ్చర్య పేద, మధ్య తరగతి ప్రజలపై పెను భారం మోపడమేనని నాగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు కరోనా కట్టిడి చర్యలను గాలికి వదిలేసి.. మరోవైపు ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.