తెలంగాణ

telangana

By

Published : Apr 3, 2020, 8:46 PM IST

ETV Bharat / state

'మర్కజ్ వెళ్లొచ్చిన వారికి యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు'

దిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారిని గుర్తించి.. చికిత్సకు తరలించామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. వారందరికీ యుద్ధప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందారు : మంత్రి ఈటల
ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందారు : మంత్రి ఈటల

దిల్లీ మర్కజ్ వెళ్లొచ్చిన వారందరినీ గుర్తించామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. బాధితులను ఐసోలేషన్ వార్డులకు తరలించామని మంత్రి వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారందరికీ యుద్ధ ప్రాతిపదికన కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సుమారు ఆరు ల్యాబ్‌ల్లో 24 గంటలు... మూడు షిఫ్టుల్లో కరోనా పరీక్షలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఇవాళ కరోనాతో ఇద్దరు మృతి చెందారని మంత్రి వివరించారు. షాద్‌నగర్‌కు చెందిన ఒకరు, సికింద్రాబాద్‌కు చెందిన మరొకరు మృతి చెందినట్లు ఈటల అన్నారు. మృతులతో సన్నిహితంగా మెలిగిన వారందరినీ గుర్తిస్తున్నామని మంత్రి తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details