ఏపీలోని విశాఖ జిల్లా కశింకోట మండలం చెరకాం గ్రామంలో రైతు రొంగలి రాజుబాబు పొలంలో పండిన కంద దుంప అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా ఇవి అర కిలో నుంచి రెండు కిలోల వరకు పెరుగుతాయి.. మహా అయితే ఐదు కిలోల వరకు ఉంటాయి.. కానీ దుంప ఏకంగా 16.4 కిలోల బరువు ఉంది. సేంద్రియ పద్ధతిలో కంద సాగు చేపడుతున్నట్లు రైతు రాజుబాబు తెలిపారు.
అబ్బో.. ఈ కంద ఎంత పెద్దదో
కంద చూశారా మీరూ..! ఓ అరకిలో, కిలో వరకూ ఉండే దుంపనైతే చూసే ఉంటారు.. కాని ఏపీలోని విశాఖలో ఉన్న కంద వీటన్నింటికంటే పెద్దది. అంటే ఐదో, పదో కాదు.. ఏకంగా 16.4 కిలోల బరువు ఉంది. మీరు చూసేయండి.
అబ్బో.. ఈ కంద ఎంత పెద్దదో