తెలంగాణ

telangana

ETV Bharat / state

సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలకు భయపడొద్దు: గవర్నర్​ - governer thamilisy tele medicine programme news

వర్షాకాలంలో వచ్చే సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలకు భయపడొద్దని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ సూచించారు. వరదల కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాజ్​భవన్​ నుంచి టెలీ మెడిసిన్​ కార్యక్రమం నిర్వహించారు. 21 మందితో నేరుగా ఫోన్​లో మాట్లాడారు. వైద్యులు డాక్టర్​ దినేష్​, డాక్టర్​ నాగమణిల సహకారంతో ప్రజల సందేహాలను నివృత్తి చేశారు.

సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలకు భయపడొద్దు: గవర్నర్​
సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలకు భయపడొద్దు: గవర్నర్​

By

Published : Oct 15, 2020, 8:06 PM IST

గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్రంపై తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజా సమస్యలపై తక్షణం స్పందించే గవర్నర్.. వరదల కారణంగా ప్రజలకు వచ్చే అనారోగ్య సమస్యలపై అవగాహన కల్పించారు. రాజ్​భవన్ నుంచి నేరుగా ప్రజలతో ఫోన్​లో మాట్లాడారు. సాయంత్రం నాలుగున్నర నుంచి ఐదున్నర వరకు జరిగిన ఈ టెలీ మెడిసిన్ కార్యక్రమంలో భాగంగా 21 మంది కాలర్స్​తో సంభాషించారు. రాజ్​భవన్​ వైద్యులు డాక్టర్ దినేష్, డాక్టర్ నాగమణిలు గవర్నర్​కు సహకారం అందించారు.

వైద్యుల సహకారంతో టెలీమెడిసిన్​ కార్యక్రమం

ఈ టెలీ మెడిసిన్ కార్యక్రమంలో భాగంగా సాధారణ జలుబు నుంచి మొదలుకొని ఇన్​ఫర్టిలిటీ, కిడ్నీ ఫెయిల్యూర్ వరకు అనేక సమస్యలను ప్రజలు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆరోగ్యం పట్ల ప్రజల్లో ఉన్న అనుమానాలను గవర్నర్ నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఓ మహిళ తన భర్త రెండు కిడ్నీలు పాడైపోయాయని.. సాయం చేయాలని కోరగా.. వెంటనే స్పందించిన గవర్నర్​ సమస్యను వివరిస్తూ ఓ లేఖ పంపాలని సూచించారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

వర్షాకాలంలో వచ్చే సాధారణ జలుబు, జ్వరం వంటి లక్షణాలకు భయపడొద్దని గవర్నర్ సూచించారు. కొవిడ్ నేపథ్యంలో చేతులను తరచూ కడుక్కోవడం, బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించటం విధిగా పాటించాలని కోరారు.

ఇదీ చూడండి: సందేహాల నివృత్తికి.. కాల్ యువర్ గవర్నర్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details