తెలంగాణ

telangana

ETV Bharat / state

'మన మహాత్ముడు'లో గాంధీ చిత్ర ప్రదర్శన - gandhi-film-screening-in-mana-mahatmudu

మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా రీజినల్​ అవుట్​ రీచ్ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'మన మహాత్ముడు' ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు.

'మన మహాత్ముడు'లో గాంధీ చిత్ర ప్రదర్శన

By

Published : Aug 11, 2019, 6:10 AM IST

Updated : Aug 11, 2019, 8:05 AM IST

మహాత్మ గాంధీ 150వ జయంతి ఉత్సవాలు, 73వ స్వాత్రంత్ర దినోత్సవం సందర్భంగా రీజినల్ అవుట్ రీచ్ బ్యూరో, సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో 'మన మహాత్ముడు' పేరుతో ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం వద్ద ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పార్రంభించారు.
గాంధీజీ చదివిన పాఠశాల, చంపారన్ సత్యాగ్రహం, ఎరవాడ జైలు, సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించిన ఫొటోలు ప్రదర్శించారు. యువతీయువకులు, ప్రయాణికులను ఆకట్టుకున్నాయి. నేటి నుంచి 4 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ ప్రాముఖ్యతను తెలిపే 50కి పైగా చిత్రాలు అందుబాటులో ఉంచారని కిషన్ రెడ్డి అన్నారు.

'మన మహాత్ముడు'లో గాంధీ చిత్ర ప్రదర్శన
1942 నుంచి 1947 వరకు జరిగిన చివరి దశ ఉద్యమంలో గాంధీజీ పాత్ర ప్రాముఖ్యతను తెలిపే ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రదర్శనలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సెల్ఫీ పాయింట్​లో యువత స్వీయ చిత్రాలు దిగారు. సంతకాలు చేసే పాయింట్​లో సంతకాలు చేసి గాంధీజీపై మమకారాన్ని చాటుకున్నారు.
Last Updated : Aug 11, 2019, 8:05 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details