తెలంగాణ

telangana

By

Published : Mar 7, 2020, 8:00 AM IST

ETV Bharat / state

14 మంది ప్రణాళిక విభాగం అధికారులు బదిలీ

తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో ప్రణాళికబద్దంగా అభివృద్ధి జరగాలన్న లక్ష్యానికి అనుగుణంగా అవసరమైన చర్యలను ప్రణాళిక విభాగం చేపడుతోంది. జీహెచ్​ఎంసీ, హెచ్​ఎండీఏలో పని చేస్తున్న14 మంది ప్రణాళిక విభాగం అధికారులను 14 ప్రాంతాలకు బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

14 మంది ప్రణాళిక విభాగం అధికారులు బదిలీ
14 మంది ప్రణాళిక విభాగం అధికారులు బదిలీ

రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రణాళికా విభాగాన్ని పటిష్టం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్న ధ్యేయానికి అనుగుణంగా అవసరమైన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో పనిచేస్తున్న ప్రణాళికా విభాగం అధికారులను ఇతర మున్సిపాలిటీలకు బదిలీ చేసింది. వివిధ స్థాయిల్లో ఉన్న 14 మంది ప్రణాళికా విభాగం అధికారులను డిప్యుటేషన్‌పై 14 ప్రాంతాలకు బదిలీ చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details