చేతి తొడుగులు అమ్ముతానంటూ హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ఇంజినీర్కు సైబర్ నేరగాడు రూ. 6.50 లక్షలు టోకరా వేశాడు. బేగంపేటకు చెందిన ముహమ్మద్ యూనుస్ స్ట్రక్చరల్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. కరోనా నేపథ్యంలో పని ప్రదేశంలో వినియోగానికి ప్రత్యేకమైన చేతి తొడుగులు ఏమైనా ఉన్నాయా అని ఇండియామార్ట్ సైట్లో వెతికారు. ఒక సంస్థలో అలాంటి వస్తువును గుర్తించారు. వెంటనే ఆ సంస్థ యజమానితో మాట్లాడారు. దాదాపు 6.50 లక్షలు విలువ చేసే చేతి తొడుగులకు ఆర్డర్ ఇచ్చారు.
సైబర్ గాలం: చేతి తొడుగుల పేరుతో ఓ ఇంజినీర్కు రూ. 6.50లక్షలు టోకరా
కరోనా నేపథ్యంలో చేతి తొడుగులు, మాస్కులకు డిమాండ్ పెరిగిపోయింది. దీనిని అదునుగా చేసుకున్న కొందరు సైబర్నేరగాళ్లు ఆన్లైన్లో తాము ప్రత్యేకమైన గ్లౌజులు అమ్ముతున్నామంటూ ప్రటనల ద్వారా అమాయకపు ప్రజలకు టోకరా వేస్తున్నారు. ఇదే తరహాలోని ఓ ప్రకటన చూసి హైదరాబాద్ బేగంపేటకు చెందిన ఓ ఇంజినీర్ సుమారు రూ. ఆరున్నర లక్షలు ఆన్లైన్లో పంపి సైబర్నేరగాళ్ల చేతిలో మోసపోయాడు.
సైబర్ గాలం: చేతి తొడుగుల పేరుతో ఓ ఇంజినీర్కు రూ. 6.50లక్షలు టోకరా
ఆ మొత్తాన్ని ముందుగానే పంపించాలని ఆ సంస్థ యజమాని చెప్పాడు. దీనితో ఆన్లైన్ ద్వారా డబ్బు బదిలీ చేశారు. ఆ తర్వాత ఆ యజమాని ఫోన్ స్పందించడం లేదు. తాను మోసపోయినట్లు గ్రహించిన యూనుస్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.