తెలంగాణ

telangana

ETV Bharat / state

నేర నియంత్రణ పద్ధతులు అమలవుతున్నా.. తగ్గని నేరాలు - NCRB REPORT 2020

దేశంలోని మెట్రో నగరాల్లో నేరాలు నానాటికీ పెరుగుతున్నాయని జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్​సీఆర్​బీ) వెల్లడించింది. జాతీయ స్థాయిలో నేరాలు, నియంత్రణ పద్ధతుల గణాంకాలను.. సంస్థ ఏటా విడుదల చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో జరిగిన నేరాల తీరును వివరించింది.

NCRB CRIME REPORT 2020
నేర నియంత్రణ పద్ధతులు అమలవుతున్నా.. తగ్గని నేరాలు

By

Published : Oct 1, 2020, 6:50 PM IST

దేశంలోనే అత్యాధునిక సాంకేతిక సమాచార పరిజ్ఞానంతో నేర నియంత్రణ పద్ధతులను అమలుచేస్తున్నా.. హైదరాబాద్​లో ఏటా నేరాలు పెరుగుతున్నాయని ఎన్​సీఆర్​బీ వెల్లడించింది. మహిళలు, యువతులు, పిల్లలను రక్షించేందుకు షీ టీమ్స్​ నిరంతరం కృషిచేస్తున్నా.. హింసాత్మక ఘటనలు తగ్గడం లేదని స్పష్టం చేసింది.

మూడేళ్ల వ్యవధిలోనే సైబర్​ నేరాలు నాలుగు రెట్లు పెరిగాయని పేర్కొంది. ఈ కేసుల్లో నిందితులను అరెస్టు చేస్తున్నా.. కోర్టుల్లో విచారణ కొనసాగుతోందని తెలిపింది.

  • మెట్రో నగరాల్లో నేరాలు
నగరం 2018 2019
1 దిల్లీ 2,25,977 2,94,653
2 కోల్‌కతా 40,757 40,684
3 చెన్నై 19,682 19,682
4 బెంగళూరు 30,792 27,251
5 హైదరాబాద్‌ 14,332 15,333
  • మెట్రో నగరాల్లో మహిళలపై హింస
నగరం 2018 2019
1 దిల్లీ 11,724 12,902
2 ముంబాయి 6,058 6,519
3 కోల్‌కతా 2,176 2,176
4 బెంగళూరు 3,427 3,486
5 హైదరాబాద్‌ 2,332 2,755
  • మెట్రో నగరాల్లో సైబర్‌ నేరాలు
నగరం 2018 2019
దిల్లీ 107 -
ముంబాయి 2,527 -
కోల్‌కతా 32 -
చెన్నై 118 -
బెంగళూరు 10,555 -
హైదరాబాద్‌ 1,379 1,793
  • హైదరాబాద్‌లో మాత్రం 2019లో సైబర్‌ నేరాల గణాంకాలు నమోదయ్యాయి. మిగతా మెట్రో నగరాల్లో గణాంకాలు నమోదు కాలేదు.

ఇవీచూడండి:నేరాలు-ఘోరాల్లో తెలుగు రాష్ట్రాల వాటా 8.2 శాతం

ABOUT THE AUTHOR

...view details