ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ న్యాయం చేయకపోవడం విచారకరమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. విధుల్లో చేరడానికి వచ్చిన కార్మికులను అన్యాయంగా అరెస్టు చేయించడాన్ని తప్పుబట్టారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించి.. న్యాయం చేయాల్సిన ముఖ్యమంత్రే... రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు.
'అంబేడ్కర్ స్ఫూర్తితో'
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాజ్యంగ వ్యవస్థల పనితీరు అంశంపై హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మంగళవారం సదస్సు నిర్వహించారు. రాజ్యాంగ వ్యవస్థలోని ప్రాథమిక హక్కులు పేదలకు పొందేలా చూడాలన్నారు. సమానత్వం, స్వేచ్ఛ ప్రజలకు అందేటట్లు కృషి చేయాలన్నారు. అంబేడ్కర్ స్ఫూర్తితో యువత ముందుకు సాగి... రాజ్యాంగంపై సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని కోదండరాం సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పాల్గొన్నారు.
కార్మికులను అక్రమంగా అరెస్ట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన : కోదండ రామ్ ఇవీ చూడండి : ఆర్టీసీ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి: కోదండరాం