తెలంగాణ

telangana

By

Published : Feb 17, 2021, 5:09 PM IST

ETV Bharat / state

కోటి వృక్షార్చనలో పాల్గొన్న పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​

సీఎం జన్మదినం సందర్భంగా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్​ రెడ్డి మొక్కలు నాటారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 దేవాలయాల్లో రైస్​మిల్లర్లు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

civil supply chairman mareddy srinivasa reddy  participated in cm birthday celebrations
కోటి వృక్షార్చనలో పాల్గొన్న పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్​

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినం పురస్కరించుకుని హైదరాబాద్​ ఎర్రమంజిల్​లోని పౌరసరఫరాల భవన్​లో సంస్థ ఛైర్మన్​ మారెడ్డి శ్రీనివాస్​ రెడ్డి మొక్కలు నాటారు. కోటి వృక్షార్చనలో భాగంగా రాష్ట్రంలోని 15 ప్రధాన ఆలయాల్లో రైస్​ మిల్లర్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్​ మిల్లుల ఆవరణాల్లో మొక్కలు నాటారు.

బాసర సరస్వతీదేవి, ఏడుపాయల వనదుర్గాభవాని, నాచారం లక్ష్మీ నరసింహస్వామి, జహీరాబాద్‌ శివాలయం, వికారాబాద్‌ అనంత పద్మనాభస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, జూబ్లీహిల్స్ వెంకటేశ్వరస్వామి, అలంపూర్​ జోగులాంబ, వరంగల్ భద్రకాళీ, యాదాద్రి లక్ష్మినర్సింహస్వామి, కురవి వీరభద్రస్వామి, కొమురవెల్లి మల్లన్నస్వామి, మిట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి, భద్రాచలం రామయ్య, కాళేశ్వరం ముక్తీశ్వరస్వామి దేవాలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు మారెడ్డి శ్రీనివాస్​ రెడ్డి తెలిపారు.

ఇదీ చూడండి :'రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్​ నూరేళ్లు జీవించాలి'

ABOUT THE AUTHOR

...view details