తెలంగాణ

telangana

By

Published : Apr 17, 2021, 6:47 PM IST

ETV Bharat / state

లింగోజిగూడ డివిజన్​కు రెండు నామినేషన్లు దాఖలు

కార్పొరేటర్​ రమేశ్​ గౌడ్​ మరణంతో ఖాళీ అయిన హైదరాబాద్​ లింగోజిగూడ డివిజన్​కు శనివారం రెండు నామినేషన్లు వచ్చాయి. భాజపా నుంచి రమేశ్​ గౌడ్ తనయుడు అఖిల్ పవన్ గౌడ్ నామ పత్రాలు దాఖలు చేయగా.. కాంగ్రెస్​ నుంచి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి నామినేషన్​ వేశారు.

lingojiguda by elections
లింగోజిగూడ డివిజన్

హైదరాబాద్​ లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలలో రెండో రోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శనివారం భాజపా నుంచి రమేశ్​ గౌడ్ తనయుడు అఖిల్ పవన్ గౌడ్ నామ పత్రాలు దాఖలు చేయగా.. కాంగ్రెస్​ నుంచి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి నామినేషన్​ వేశారు.

ఈ ఉప ఎన్నికకు తెరాస దూరంగా ఉండాలని నిర్ణయించింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రగతిభవన్​లో శుక్రవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్​ను కలిసింది. రమేష్ గౌడ్ కుమారుడు పార్టీ తరఫున పోటీ చేస్తున్నందున ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. భాజపా విజ్ఞప్తిని పరిశీలించిన తెరాస, పోటీ చేయడం లేదని ప్రకటించింది.

ఇదీ చదవండి:వాట్సాప్‌ వినియోగదారులపై సైబర్​ దాడి!

ABOUT THE AUTHOR

...view details