హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నికలలో రెండో రోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శనివారం భాజపా నుంచి రమేశ్ గౌడ్ తనయుడు అఖిల్ పవన్ గౌడ్ నామ పత్రాలు దాఖలు చేయగా.. కాంగ్రెస్ నుంచి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి నామినేషన్ వేశారు.
లింగోజిగూడ డివిజన్కు రెండు నామినేషన్లు దాఖలు
కార్పొరేటర్ రమేశ్ గౌడ్ మరణంతో ఖాళీ అయిన హైదరాబాద్ లింగోజిగూడ డివిజన్కు శనివారం రెండు నామినేషన్లు వచ్చాయి. భాజపా నుంచి రమేశ్ గౌడ్ తనయుడు అఖిల్ పవన్ గౌడ్ నామ పత్రాలు దాఖలు చేయగా.. కాంగ్రెస్ నుంచి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి నామినేషన్ వేశారు.
లింగోజిగూడ డివిజన్
ఈ ఉప ఎన్నికకు తెరాస దూరంగా ఉండాలని నిర్ణయించింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రగతిభవన్లో శుక్రవారం తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ను కలిసింది. రమేష్ గౌడ్ కుమారుడు పార్టీ తరఫున పోటీ చేస్తున్నందున ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. భాజపా విజ్ఞప్తిని పరిశీలించిన తెరాస, పోటీ చేయడం లేదని ప్రకటించింది.
ఇదీ చదవండి:వాట్సాప్ వినియోగదారులపై సైబర్ దాడి!