తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏఎస్సై ఆత్మహత్యాయత్నం.. వేధింపులే కారణమా!? - balapur police station hyderabad

బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఏఎస్సై నరసింహ ఆత్మహత్యాయత్నం చేశారు. సీఐ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నీళ్ల ట్యాంకు ఎక్కి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడడంతో డీఆర్డీఓ అపోలో ఆస్పత్రికి తరలించారు.

పెట్రోల్ పోసుకుని స్టేషన్ ముందే ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

By

Published : Nov 22, 2019, 5:54 PM IST

Updated : Nov 22, 2019, 7:22 PM IST

పెట్రోల్ పోసుకుని స్టేషన్ ముందే ఏఎస్సై ఆత్మహత్యాయత్నం

బాలాపూర్​ పోలీస్​స్టేషన్​ సమీపంలో ఏఎస్సై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నీళ్లట్యాంకు పైకి ఎక్కిన ఏఎస్సై నరసింహ ఒంటిపై పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆత్మహత్య చేసుకునేందుకు నీళ్ల ట్యాంకు ఎక్కినప్పుడు కానిస్టేబుళ్లు వారించే ప్రయత్నం చేసినా అతను వినలేదు. తోటి పోలీస్​ అతన్ని రక్షించి వెంటనే కిందికి దింపాడు.

నరసింహ ఛాతిభాగానికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే డీఆర్డీఓ అపోలో ఆసుపత్రికి తరలించారు. 20 శాతానికి పైగా కాలిన గాయాలు కావడంతో అత్యవసర చికిత్సా విభాగంలో ఉంచి వైద్యం అందిస్తున్నారు.

అసలేం జరిగిందంటే...?

బాలాపూర్​ పీఎస్​లో నరసింహ ఏఎస్సైగా విధులు నిర్వహించేవాడు. ఇటీవల అతన్ని మంచాల్ పీఎస్​కు బదిలీ చేశారు. గురువారం అక్కడికి వెళ్లి రిపోర్టు చేశారు. అయితే బాలాపూర్​ సీఐ సైదులు... తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ నివేదిక ఇవ్వడం వల్లే ఉన్నతాధికారులు బదిలీ చేశారని నరసింహ ఆరోపించారు. ఎల్బీ నగర్​ డీసీపీ సన్​ప్రీత్​సింగ్​, వనస్థలిపురం ఏసీపీ జయరాంతోపాటు ఇతర ఉన్నతాధికారులు అపోలో ఆసుపత్రికి వచ్చి నరసింహ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ కంచన్​బాగ్​ అపోలో ఆసుపత్రికి చేరుకుని... చికిత్స పొందుతున్న నర్సింహను పరామర్శించారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో వరుసగా మూడో రోజూ బంద్

Last Updated : Nov 22, 2019, 7:22 PM IST

ABOUT THE AUTHOR

...view details