తెలంగాణ

telangana

By

Published : Dec 1, 2022, 3:33 PM IST

ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జూనియర్​ శ్రీదేవి

Janhvi Kapoor Visits Tirumala Tirupati Temple: తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో.. వేదపండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

Janhvi Kapoor
నటి జాన్వీ కపూర్​

Janhvi Kapoor Visits Tirumala Tirupati Temple: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్​ ఏపీలోని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేసి జాన్వీ కపూర్​కు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి జాన్వీ కపూర్​

ABOUT THE AUTHOR

...view details