తెలంగాణ

telangana

ETV Bharat / state

డిగ్రీలో చేరికకు 1.07 లక్షల మంది ఆసక్తి - దోస్త్ తాజా వార్తలు

డిగ్రీ కోర్సులో చేరడానికి 1,07,189 మంది విద్యార్థులు ఆసక్తి చూపారు. ఈ విషయాన్ని కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు.

A total of 1,07,189 students showed interest in joining the degree course in the first installment admissions in telangana
డిగ్రీలో చేరికకు 1.07 లక్షల మంది ఆసక్తి

By

Published : Sep 28, 2020, 10:00 AM IST

దోస్త్‌ తొలి విడత ప్రవేశాల్లో డిగ్రీ కోర్సులో చేరడానికి 1,07,189 మంది విద్యార్థులు ఆసక్తి చూపారు. ఈ మేరకు వారు ఆన్‌లైన్‌ ద్వారా సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేశారని కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు.

మొత్తం 1,41,340 మందికి మొదటి విడతలో సీట్లు దక్కగా...దాదాపు 34 వేల మంది సీట్లను రిజర్వు చేసుకునేందుకు ముందుకురాలేదన్నారు. రెండో విడతలో 30,787 మంది రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని చెప్పారు. మొదటి విడతలో సీట్లు దక్కిన వారితోపాటు కొత్తగా నమోదు చేసుకున్న వారితో కలిపి రెండో విడతలో మొత్తం 78,818 మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకున్నారని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి :వైద్య ఆరోగ్య శాఖ నూతన విధానాలకు సిద్ధం కావాలి: ఈటల

ABOUT THE AUTHOR

...view details